భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా అజిత్ అగార్కర్ పదవీ కాలాన్ని బీసీసీఐ మరో ఏడాది పొడిగించింది.
2026, జూన్ వరకు ఛైర్మన్గా అతడే కొనసాగనున్నాడు.
భారత క్రికెట్లో సంధి దశను విజయవంతంగా అధిగమించడంతో పాటు.. భారత జట్టుకు కీలక విజయాలు సాధించేలా జట్లను ఎంపిక చేసినందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
2023 జులైలో అతడు సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా ఎంపికయ్యాడు.