Published on Aug 30, 2025
Current Affairs
అంగారకుడిపై ఆవాసాలు
అంగారకుడిపై ఆవాసాలు

రాబోయే నాలుగు దశాబ్దాల్లో అంగారక గ్రహంపై 3డీ ముద్రిత నివాసాలను ఏర్పాటు చేయాలని, మానవులను తీసుకెళ్లడానికి ముందస్తు యంత్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఇందుకోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రూపొందించిన రోడ్‌మ్యాప్‌ను అనుసరించనుంది.

ఈ రోడ్‌మ్యాప్‌ను ఇటీవల జరిగిన జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇస్రో దేశవ్యాప్తంగా సంప్రందింపులు జరిపి రూపొందించింది. 

ఈ రోడ్‌మ్యాప్‌ ప్రకారం.. భారత్‌ 2047 నాటికి చంద్రునిపై ఓ క్రూ స్టేషన్‌ను నిర్మించాలనుకుంటోంది.