- అణ్వస్త్రాలను మోసుకెళ్లగల అగ్ని-3 బాలిస్టిక్ క్షిపణిని భారత్ 2026, ఫిబ్రవరి 6న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరానికి చేరువలోని చాందీపుర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఉపరితలం నుంచి ఉపరితలంపైనున్న లక్ష్యాలను ఛేదించగల ఈ అస్త్రం పరిధి 3వేల కిలోమీటర్ల పైనేనని అధికారులు తెలిపారు.
- అధునాతన క్షిపణి అయిన అగ్ని-3.. ఇప్పటికే భారత సైనిక దళాల అమ్ములపొదిలో చేరింది. 1.5 టన్నుల పేలోడ్ను ఇది మోసుకెళ్లగలదు. దీని పొడవు 17 మీటర్లు. ఘన ఇంధనంతో పనిచేసే రెండు దశలు ఇందులో ఉన్నాయి.