Published on Jan 20, 2025
Current Affairs
అక్సెల్సెన్, సియంగ్‌కు టైటిళ్లు
అక్సెల్సెన్, సియంగ్‌కు టైటిళ్లు

ఇండియా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో విక్టర్‌ అక్సెల్సెన్‌ (డెన్మార్క్‌), ఆన్‌ సియంగ్‌ (దక్షిణ కొరియా) టైటిళ్లు సాధించారు.

2025, జనవరి 19న జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో మూడో సీడ్‌ అక్సెల్సెన్‌ 21-16, 21-8తో లీ చుక్‌ (హాంకాంగ్‌)పై నెగ్గి విజేతగా నిలిచాడు.

2017, 2019లలో టైటిళ్లు గెలిచిన అక్సెల్సెన్‌ ఈ టోర్నీలో ఛాంపియన్‌గా నిలవడం ఇది మూడోసారి. 

మహిళల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ సియంగ్‌ 21-12, 21-9తో పోర్న్‌పావీ చోచువాంగ్‌ (థాయ్‌లాండ్‌)పై గెలుపొందింది.