ఏపీ ఐఏఎస్ కేడర్ బలం 239 నుంచి 259కి పెంపు
ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ కేడర్ బలాన్ని 239 నుంచి 259కి పెంచుతూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ 2026, జనవరి 17న నోటిఫికేషన్ జారీచేసింది. 2017 నవంబరు 10 తర్వాత రాష్ట్ర ఐఏఎస్ కేడర్ స్ట్రెంగ్త్ను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం ఇదే ప్రథమం. ఇందులో సీనియర్ డ్యూటీ పోస్టులను 130 నుంచి 141కి పెంచింది. వీటిలో ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి పోస్టుల సంఖ్య 2 నుంచి 3కి చేరాయి. రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెరిగిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పోస్టులను ఇదివరకున్న 13 నుంచి 26 చేసింది.