Posts

Current Affairs

పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌

కేంద్ర ప్రభుత్వం దీన్‌దయాళ్‌ అంత్యోదయ యోజన- నేషనల్‌ రూరల్‌ లైవ్లీహుడ్‌ మిషన్‌ కింద ప్రారంభించిన లఖ్‌పతి దీదీ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో 17,41,362 మంది మహిళలు నమోదు చేసుకున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ 2025, జులై 22న తెలిపారు. మహారాష్ట్ర (22,69,981 మంది) తర్వాత అత్యధిక మంది లఖ్‌పతి దీదీలు ఏపీలో ఉన్నట్లు చెప్పారు. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.414.06 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించినట్లు వెల్లడించారు. 

Current Affairs

హెన్లీ పాస్‌పోర్టు సూచీ -2025

శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితాలో భారత్‌  77వ స్థానంలో ఉన్నట్లు హెన్లీ పాస్‌పోర్టు సూచీ -2025 వెల్లడించింది. 2024లో మన దేశం 80వ ర్యాంకులో ఉంది. అయితే, వీసా రహిత ప్రయాణాలను అనుమతించే దేశాల సంఖ్య మాత్రం 59కి పరిమితమైంది. గతంలో ఇది 62 దేశాలుగా ఉంది. 2024లో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్‌ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలవగా.. ఈసారి సింగపూర్‌ మాత్రమే తొలి స్థానంలో ఉంది. ఈ పాస్‌పోర్టుతో 193 దేశాలకు వీసా-ఫ్రీ ప్రయాణానికి అవకాశం ఉంటుంది. రెండో స్థానంలో ఉన్న జపాన్, దక్షిణకొరియాల పాస్‌పోర్టుతో 190 దేశాలు చుట్టిరావచ్చు. డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, స్పెయిన్‌లు మూడో స్థానంలో ఉన్నాయి.

Current Affairs

ర్యాండ్‌స్టడ్‌ ఎంప్లాయర్‌ బ్రాండ్‌ రిసెర్చ్‌- 2025

భారతదేశంలో ఉద్యోగార్థులకు అత్యంత ఆకర్షణీయ యాజమాన్య సంస్థగా టాటా గ్రూప్‌ అగ్రస్థానంలో నిలిచింది. ర్యాండ్‌స్టడ్‌ ఎంప్లాయర్‌ బ్రాండ్‌ రిసెర్చ్‌- 2025 సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ జాబితాలో రెండు, మూడో స్థానాల్లో గూగుల్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌ నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా 34 దేశాల్లో 1,70,000 మంది నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ జాబితాను ర్యాండ్‌స్టడ్‌ రూపొందించింది. వీరిలో 3,500 మంది భారత్‌ నుంచి ఉన్నారు. 

Current Affairs

గీతా గోపీనాథ్‌

అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్‌)లో డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న భారత మూలాలున్న ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌ 2025 ఆగస్టులో తన పదవి నుంచి వైదొలగనున్నారు. ఈ విషయాన్ని ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టలినా జార్జివా 2025, జులై 22న తెలిపారు. పదవి నుంచి వైదొలగిన తర్వాత సెప్టెంబరు 1న ఆమె తిరిగి హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా చేరనున్నారు.

Current Affairs

యునెస్కో నుంచి మళ్లీ వైదొలగిన అమెరికా

‘ఐక్యరాజ్యసమితి విద్య వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ’ (యునెస్కో) నుంచి తాను మరోసారి వైదొలగుతున్నట్లు అమెరికా ప్రకటించింది. సంస్థ ప్రదర్శిస్తున్న ఇజ్రాయెల్‌ వ్యతిరేకత కారణంగానే.. చేరిన రెండేళ్లకే వైదొలగుతున్నామని స్పష్టంచేసింది.  పారిస్‌ కేంద్రంగా పనిచేస్తున్న యునెస్కో నుంచి అమెరికా వైదొలగడం ఇది మూడోసారి. 

Current Affairs

మిగ్‌-21

భారత వాయుసేనకు 60 ఏళ్లపాటు వెన్నెముకగా నిలిచిన మిగ్‌-21 యుద్ధవిమానాలను సర్వీసు నుంచి పూర్తిగా ఉపసంహరించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సెప్టెంబరు 19న చండీగఢ్‌లోని వైమానిక స్థావరంలో జరిగే ఒక కార్యక్రమంలో వీటి సేవలకు లాంఛనంగా స్వస్తి పలకనున్నట్లు వివరించాయి. అక్కడి 23వ స్క్వాడ్రన్‌లో ఈ జెట్‌లు భాగంగా ఉన్నాయి.  మిగ్‌-21 యుద్ధవిమానాన్ని రష్యా (నాటి సోవియట్‌ యూనియన్‌)కు చెందిన మికోయన్‌-గురేవిచ్‌ సంస్థ రూపొందించింది. ఇది 1955 జూన్‌ 16న మొదట గగనవిహారం చేసింది. 1959 నుంచి 1985 వరకూ వీటి ఉత్పత్తి సాగింది. గరిష్ఠ వేగం గంటకు 2,230 కిలోమీటర్లు.  ప్రపంచవ్యాప్తంగా 60కిపైగా దేశాలకు ఇవి సేవలందించాయి. మొత్తంమీద 11,496 మిగ్‌-21లను రష్యా ఉత్పత్తి చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తయిన సూపర్‌సోనిక్‌ యుద్ధవిమానంగా ఇది చరిత్ర సృష్టించింది. అలాగే ఎక్కువ యుద్ధాల్లో పాల్గొన్న ఫైటర్‌ జెట్‌గా కూడా గుర్తింపు పొందింది. 

Current Affairs

అపాచీ పోరాట హెలికాప్టర్లు

భారత సైనిక పోరాట సామర్థ్యాన్ని మరింత పెంచే విధంగా మూడు అపాచీ పోరాట హెలికాప్టర్లు 2025, జులై 22న మన దేశానికి చేరాయి. మొత్తం ఆరు అపాచీ ఏహెచ్‌-64ఈల కొనుగోలుకు భారత్‌.. అమెరికాకు చెందిన బోయింగ్‌ సంస్థతో రూ.4,168 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మిగిలిన మూడు ఈ ఏడాది చివరిలోగా అందుతాయి.  ఆధునిక క్షిపణులు, రాకెట్లతో కూడిన ఈ లోహవిహంగం.. ప్రతికూల ప్రాంతాల్లో భారత సైన్యంలోని విమానయాన విభాగం సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. భారత వాయుసేన వద్ద ఇప్పటికే 22 అపాచీ హెలికాప్టర్లు ఉన్నాయి. 

Current Affairs

శ్రీదాశరథి కృష్ణమాచార్య అవార్డు

ప్రతిష్ఠాత్మక శ్రీదాశరథి కృష్ణమాచార్య అవార్డును 2025 సంవత్సరానికి ప్రముఖ కవి, వ్యాసకర్త అన్నవరం దేవేందర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం దాశరథి జయంతి సందర్భంగా ప్రభుత్వం ఈ సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది. రవీంద్రభారతిలో 2025, జులై 22న దేవేందర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఈ అవార్డును బహూకరించారు. అవార్డుతోపాటు రూ.1,01,116 నగదు, జ్ఞాపిక, శాలువను అందించారు.  సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం పోతారం(ఎస్‌)లో దశరథం, కేదారమ్మలకు అన్నవరం దేవేందర్‌ 1962 అక్టోబరు 17న జన్మించారు.

Current Affairs

Henley Passport Index 2025

♦ India ranked 77th on the Henley Passport Index 2025. Indian passport holders can now travel visa-free or with visa-on-arrival access to 59 destinations.  ♦ Among the 59 destinations open to Indian travellers are Malaysia, Indonesia, Maldives, and Thailand, which offer visa-free entry. ♦ Countries like Sri Lanka, Myanmar, and Macau offer visa-on-arrival facilities. ♦ Singapore retains the top spot, offering visa-free access to 193 destinations. ♦ Japan and South Korea follow closely with access to 190 countries. ♦ Seven European nations — including France, Germany, and Italy — share third place, each with access to 189 destinations. ♦ New Zealand, Switzerland, and Greece rank fifth, while the UK and the US have dropped slightly, ranking sixth and tenth, respectively.  ♦ Afghanistan remains at the bottom of the ranking, with its citizens able to access just 25 destinations without a prior visa. ♦ The Henley Passport Index ranks passports based on the number of destinations their holders can access without a prior visa.

Current Affairs

MiG-21

♦ The Indian Air Force is set to phase out the last of its iconic Mikoyan-Gurevich MiG-21 fighter jets in September, ending a journey of 62 years. ♦ The IAF has 36 MiG-21 planes left in its arsenal, a far cry from the nearly 900 - of which around 660 were built in India - that so successfully protected the nation's skies and territories. ♦ The induction of the MiG-21, India’s first supersonic fighter, began in 1963. ♦ IAF has operated a raft of MiG-21 variants over the last six decades : Type 74 or MiG 21F, Type 76 or MiG 21PF, Type 77 or MiG 21FL, Type 96 or MiG 21M, Type 75 or MiG 21 Bis (upgraded Type 96) and the MiG-21 Bison.