Posts

Current Affairs

The Quality Council of India (QCI)

♦ The Quality Council of India (QCI) on 24 December 2025 announced a comprehensive set of next-generation quality reforms aimed at strengthening India’s quality ecosystem across healthcare, laboratories, MSMEs and manufacturing sectors. ♦ The reforms were unveiled on the eve of Sushasan Divas 2025 and align with the national vision of Viksit Bharat 2047. The reforms are being implemented under the guidance of Union Minister of Commerce and Industry Piyush Goyal. ♦ As part of the system-wide reforms, QCI unveiled the Q Mark – Desh ka Haq, a QR-coded Mark of Quality designed to enhance transparency, trust and citizen awareness. The initiative will allow citizens to verify the quality credentials of laboratories, hospitals and MSMEs, while helping eliminate fake certificates.

Current Affairs

The National Test House (NTH)

♦ The National Test House (NTH) and the Department of Posts, Government of India, have signed a Memorandum of Understanding (MoU) to enable nationwide collection and transportation of samples for quality testing. The agreement aims to strengthen consumer protection and improve access to quality testing services by facilitating safe, reliable and timely delivery of samples to NTH laboratories across the country. ♦ Under the MoU, the Department of Posts will provide doorstep sample pickup from customers and transport the samples to NTH laboratories located in Kolkata, Ghaziabad, Mumbai, Jaipur, Guwahati, Varanasi and Chennai. The service will leverage India Post’s extensive network spanning urban, rural and remote regions. ♦ The MoU was signed on December 24, on the occasion of National Consumer Day at Bharat Mandapam in New Delhi, in the presence of Union Minister for Consumer Affairs, Food and Public Distribution Pralhad Joshi and Minister of State B. L. Verma.

Current Affairs

జాతీయ వినియోగదారుల దినోత్సవం

వ్యక్తిగత, సామాజిక, కుటుంబ అవసరాల కోసం వస్తువులు లేదా సేవలు పొందే వ్యక్తిని వినియోగదారుడు అంటారు. ప్రతి పరిశ్రమ ద్వారా ఉత్పత్తి చేసే వస్తువు లేదా సేవ అంతిమంగా వినియోగదారుకు చేరాలనే ఉద్దేశంతోనే ఆయా సంస్థలు పనిచేస్తుంటాయి. వీరు లేకపోతే కంపెనీలకు మనుగడే ఉండదు. వినియోగదారులకు నాణ్యమైన వస్తు, సేవలు అందించడం సంస్థల ప్రాథమిక విధి. అయితే వివిధ కంపెనీలు మోసపూరిత ధోరణితో కన్స్యూమర్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మన దేశంలో వినియోగదారుల ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో ఏటా డిసెంబరు 24న ‘జాతీయ వినియోగదారుల దినోత్సవం’గా (National Consumer Day) నిర్వహిస్తారు. దీన్నే ‘జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం’ (National Consumer Rights Day) అని కూడా అంటారు. వినియోగదారుల రక్షణ, సాధికారత, హక్కులపై అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.  చారిత్రక నేపథ్యం భారతదేశంలో అత్యంత ముఖ్యమైన చట్టాల్లో వినియోగదారుల రక్షణ చట్టం 1986 ఒకటి. అన్యాయమైన వాణిజ్య పద్ధతులు, లోపభూయిష్ట వస్తువులు, నాణ్యత లేని సేవల నుంచి వినియోగదారుడిని రక్షించడం దీని లక్ష్యం. దీని అమలుకు ముందు మన దేశంలో వినియోగదారుల సమస్యలకు సరైన పరిష్కారం లేదు. విక్రేతల దోపిడీ అధికంగా ఉండేది. ఈ చట్టం వచ్చాక ఫిర్యాదుల పరిష్కారం వేగవంతం అయ్యింది. ఈ చట్టాన్ని భారతదేశంలో వినియోగదారుల హక్కుల మాగ్నా కార్టా అని పిలుస్తారు.  ఇది 1986, డిసెంబరు 24న మన దేశంలో అమల్లోకి వచ్చింది. భారత్‌లోని వినియోగదారుల హక్కుల్లో నిర్మాణాత్మక మార్పు తీసుకొచ్చిన ఈ చట్టం అమలైన తేదీని ఏటా ‘జాతీయ వినియోగదారుల దినోత్సవం’గా జరపాలని 2019లో భారత ప్రభుత్వం ప్రకటించింది. 2020 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు. 

Current Affairs

కొలరాడో స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌తో ఎన్‌ఎండీసీ ఒప్పందం

ప్రభుత్వరంగ గనుల సంస్థ ఎన్‌ఎండీసీ అమెరికాలోని కొలరాడో స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌తో ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ప్రధానంగా మైనింగ్, మినరల్‌ ప్రాసెసింగ్, మెటలర్జీ, గనుల విభాగంలో ఏఐ/ఎంఎల్‌ (కృత్రిమమేధ/యాంత్రీకరణ)పై పరిశోధనలు నిర్వహించడం కోసం ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎన్‌ఎండీసీ వెల్లడించింది.

Current Affairs

‘ఇండియాస్‌ ప్రోగ్రెస్‌ టువర్డ్స్‌ మలేరియా ఎలిమినేషన్‌’ నివేదిక

దేశంలో 2015-24 మధ్య దశాబ్దకాలంలో మలేరియా కేసుల్లో 80 - 85 శాతం తగ్గుదల నమోదైనట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ 2025, డిసెంబరు 24న విడుదల చేసిన ‘ఇండియాస్‌ ప్రోగ్రెస్‌ టువర్డ్స్‌ మలేరియా ఎలిమినేషన్‌’ నివేదిక వెల్లడించింది. 2015లో 10.17 లక్షలమేర నమోదైన మలేరియా కేసులు 2024 నాటికి 2.27 లక్షలకు తగ్గాయని తెలిపింది. అలాగే మలేరియా సంబంధ మరణాలు కూడా ఇదే తీరులో 384 నుంచి 83కు తగ్గాయి. గతంలో ఎన్నడూలేని విధంగా 2023లో వార్షిక రక్తపరీక్షల రేటు 25 శాతానికి  చేరినట్లు తెలిపింది. 

Current Affairs

ఎల్‌వీఎం3-ఎం6 ప్రయోగం

దేశ చరిత్రలో తొలిసారిగా 6,100 కిలోల బరువైన బ్లూబర్డ్‌ బ్లాక్‌-2 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌-షార్‌ నుంచి 2025, డిసెంబరు 24న ఉపగ్రహాన్ని తీసుకుని అత్యంత శక్తిమంతమైన బాహుబలి రాకెట్‌ ఎల్‌వీఎం3-ఎం6 నింగిలోకి దూసుకెళ్లింది. దేశ తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌’లో ఎల్‌వీఎం3 రాకెట్‌నే ఉపయోగించనున్నారు.  అమెరికాలోని టెక్సస్‌కు చెందిన ఏఎస్‌టీ స్పేస్‌ మొబైల్‌ సంస్థ రూపొందించిన అత్యంత బరువైన బ్లూబర్డ్‌ బ్లాక్‌-2 ఉపగ్రహాన్ని ఇస్రో 518.5 కి.మీ. ఎత్తులో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 

Government Jobs

రైట్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన గురుగ్రామ్‌లోని రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ (రైట్స్‌) రెగ్యులర్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 06 వివరాలు: 1. సీనియర్ మేనేజర్‌(పోర్ట్స్‌ అండ్ వాటర్‌వేస్‌): 01 2. మేనేజర్‌(పోర్ట్స్‌ అండ్ వాటర్‌ వేస్‌): 02 3. మేనేజర్(కోస్టల్ మోడలింగ్‌): 02 4. అసిస్టెంట్‌ మేనేజర్(పోర్ట్ ప్లానింగ్‌): 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 32 నుంచి 38 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు పోస్టులను అనుసరించి రూ.40,000 నుంచి రూ.1,80,000. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.300. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.  ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 జనవరి 27. పరీక్ష తేదీ: 2026 ఫిబ్రవరి 22. Website:https://www.rites.com/Career

Government Jobs

రైట్స్‌ లిమిటెడ్‌లో అసిస్టెంట్‌ మేనేజర్ పోస్టులు

ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన గురుగ్రామ్‌లోని రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ (రైట్స్‌) రెగ్యులర్‌ ప్రాతిపదికన అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: అసిస్టెంట్‌ మేనేజర్‌: 07 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ/పీజీడీబీఏ/పీజీడీబీఎం/పీజీడీఎం/పీజీడీహెచ్‌ఆర్‌ఎంలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 32 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.  దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.300. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 జనవరి 27. Website:https://www.rites.com/Career

Government Jobs

రాజమండ్రి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో పోస్టులు

రాజమండ్రి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఒప్పంద, ఔట్‌ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 60 వివరాలు: 1. ఆఫీస్‌ సబార్డినేట్‌: 25 2. అనస్థీషియా టెక్నీషియన్‌: 02 3. కార్డియాలజీ టెక్నీషియన్: 03 4. ల్యాబ్‌ టెక్నీషియన్‌: 02 5. ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నీషియన్‌: 02 6. జనరల్‌ డ్యూటీ అటెండెంట్‌: 19 7. స్టోర్‌ అటెండెంట్‌: 03 8. ల్యాబ్‌ అటెండెంట్‌: 01 9. ఈసీజీ టెక్నీషియన్‌: 01 10. లైబ్రరీ అసిస్టెంట్‌: 01 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్‌, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 42 ఏళ్లు. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ఆధారంగా. దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.300, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, ఈఎస్‌ఎం, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.200. ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ: 2026 జనవరి 9. Website: https://eastgodavari.ap.gov.in/notice_category/recruitment/

Government Jobs

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో వర్క్‌మెన్ కేటగిరి పోస్టులు

కేరళలోని భారత ప్రభుత్వ మినీరత్న షెడ్యూల్‌ ఏ సంస్థ అయిన కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ వర్క్‌మెన్‌ కేటగిరిలో వివిధ టెక్నికల్, టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.   మొత్తం పోస్టుల సంఖ్య: 132 వివరాలు:  సీనియర్ షిప్ డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ (మెకానికల్, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌): 30 జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ (మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, సివిల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌): 53 ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ (మెకానికల్‌, కెమికల్‌): 06 స్టోర్‌ కీపర్‌: 09 అసిస్టెంట్‌: 34 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60శాతం మార్కులతో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.  పే స్కేల్‌: నెలకు అసిస్టెంట్‌ పోస్టుకు రూ.22,500- రూ.73,750; ఇతర పోస్టులకు రూ.23,500- రూ.77,000. వయోపరిమితి: చివరి తేదీ నాటికి 35 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: సీనియర్ షిప్ డ్రాఫ్ట్స్‌మ్యాన్‌కు ఆబ్జెక్టీవ్‌ సీబీటీ, ప్రాక్టికల్‌ టెస్ట్‌ (ఫేజ్‌-1, ఫేజ్‌-2); ఇతర పోస్టులకు సీబీటీ, డిస్క్రిఫ్టివ్‌ టైప్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు: జనరల్‌ రూ.700; ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 12.01.2026. Website:https://cochinshipyard.in/