Posts

Current Affairs

జాతీయ సమైక్యతా దినోత్సవం

భారతదేశం విభిన్న మతాలు, జాతులు, భాషలు, సంస్కృతి - సంప్రదాయాలకు నిలయం. ప్రజల మధ్య ఎన్ని భేదాలు ఉన్నప్పటికీ అందరం ఒకటే అనే భావనను పెంపొందించడమే జాతీయ సమైక్యత. దేశ పౌరులు తామంతా భారతీయులం, మాది భారత జాతి అని మానసికంగా అనుకున్నప్పుడే ఇది సాధ్యపడుతుంది. తద్వారా దేశం సుస్థిరంగా, పటిష్టంగా ఉంటుంది. భారతదేశ తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా మన దేశంలో ఏటా నవంబరు 19న ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’గా (National Integration Day) నిర్వహిస్తారు. దేశ ప్రజల్లో ఐక్యత, శాంతి, ప్రేమ, సోదరభావాన్ని పెంపొందించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం ఇందిరా గాంధీ 1917, నవంబరు 19న ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌ (ప్రస్తుత అలహాబాద్‌)లో జన్మించారు. ఆమె ప్రధానిగా ఉన్న సమయంలో దేశ ఐక్యత, సమగ్రత కోసం పాటుపడ్డారు. భారత సమాఖ్య నిర్మాణాన్ని బలోపేతం చేసే దిశగా ఆమె ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఇందిరా గాంధీ హయాంలో చేపట్టిన గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, అందరికీ విద్య - ఆరోగ్యం లాంటి కార్యక్రమాలు ఎంతగానో ప్రసిద్ధి చెందాయి. దేశాభివృద్ధితోపాటు జాతీయ సమగ్రతలకు ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఏటా ఆమె జయంతిని ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’గా జరపాలని ప్రభుత్వం తీర్మానించింది.

Current Affairs

నల్సా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌

జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ (నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ-నల్సా) కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ నియమితులయ్యారు. 2025, నవంబరు 24 నుంచి జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ నియామకం అమల్లోకి వస్తుంది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నవంబరు 19న ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఈ పదవిలో జస్టిస్‌ సూర్యకాంత్‌ ఉన్నారు. ఈ నెల 23న సీజేఐ జస్టిస్‌ గవాయ్‌ పదవీ విరమణ చేసిన తర్వాత 24న జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. దాంతో ఆ స్థానంలో జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ను నియమిస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు వెలువరించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో సీనియారిటీ పరంగా రెండో స్థానంలో ఉన్న వారిని ఈ పదవిలో నియమిస్తారు.

Current Affairs

కాగ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌

ఆర్థిక వ్యవహారాల ఆడిట్‌ కోసం కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (కాగ్‌) హైదరాబాద్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీఓఈ)ని ఏర్పాటు చేయనుంది. ఈ జాతీయ కేంద్రం ఆర్థిక ఆడిట్‌ రంగంలో ఆవిష్కరణలు, పరిశోధన, వృత్తిపరమైన అభివృద్ధికి తోడ్పడుతుందని డిప్యూటీ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కమర్షియల్, రిపోర్ట్‌ సెంట్రల్‌) ఏఎం బజాజ్‌ వెల్లడించారు. అంతర్జాతీయంగా అమల్లో ఉన్న ఆడిట్‌ విధానాలు, నైపుణ్యాలు పెంచే కేంద్రంగా ఇది పనిచేస్తుందన్నారు. దీంతో ఆడిట్‌లు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండటమే కాకుండా, ఈ రంగంలో ప్రపంచ బెంచ్‌మార్క్‌లను రూపొందించే స్థాయికి చేరతాయన్నారు. 

Current Affairs

సైనిక జాకెట్‌పై మేధో ఆస్తి హక్కు

అతి శీతల వాతావరణంలో సైనికులు ధరించే సరికొత్త సైనిక జాకెట్‌ ‘‘కోట్‌ కంబాట్‌’’ను భారత సైన్యం రూపొందించింది. డిజిటల్‌ ప్రింట్‌తో కూడుకున్న ఈ జాకెట్‌కు సంబంధించి మేధో ఆస్తి హక్కుల్ని (పేటెంట్‌ రైట్స్‌) భారత సైన్యం దక్కించుకుంది.  దిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఎఫ్‌టి) దీన్ని రూపొందించిందని రక్షణ శాఖ వర్గాలు 2025, నవంబరు 19న వెల్లడించాయి. సైన్యం ఈ జాకెట్‌ను 2025, జనవరిలో ప్రవేశపెట్టింది. 

Current Affairs

ఇందిరాగాంధీ శాంతి పురస్కారం

చిలీ మాజీ అధ్యక్షురాలు, ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగం మాజీ చీఫ్‌ మిషెల్‌ బచెలెట్‌కు ఇందిరా గాంధీ శాంతి పురస్కారం (2024) అందుకున్నారు. 2025, నవంబరు 19న దిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేత, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దీన్ని ఆమెకు ప్రదానం చేశారు. నిరాయుధీకరణ, అభివృద్ధిపై చేసిన సేవలకుగాను బబెలెట్‌కు ఈ పురస్కారం దక్కింది. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఏటా ఈ అవార్డును అందిస్తారు.

Current Affairs

టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో ఫెదరర్‌

టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌కు ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కింది. అతడు  పురుషుల సింగిల్స్‌లో 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచిన తొలి ఆటగాడిగా నిలిచాడు. 2022లో అతడు రిటైరయ్యాడు. నామినీల్లో 75 శాతం ఓట్లు వచ్చిన వారికి హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో స్థానం లభిస్తుంది. పాత్రికేయులు, అభిమానులు, హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ సభ్యులు తదితరులు ఓట్లు వేశారు. 

Current Affairs

న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడిగా గ్రేట్‌బ్యాచ్‌

న్యూజిలాండ్‌ మాజీ బ్యాటర్‌ మార్క్‌ గ్రేట్‌బ్యాచ్‌ ఆ దేశ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. అతడు 1988 నుంచి 1996 వరకు 41 టెస్టులు, 84 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. గ్రేట్‌బ్యాచ్‌ గతంలో న్యూజిలాండ్‌ సెలక్టర్, కోచ్‌గా కూడా పని చేశాడు. లెస్లీ ముర్దోక్‌ స్థానంలో అతడు న్యూజిలాండ్‌ క్రికెట్‌ (ఎన్‌జెడ్‌సీ) అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకున్నాడు. 

Government Jobs

టీసీఐఎల్‌లో ఉద్యోగాలు

టెలీ కమ్యూనికేషన్స్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (టీసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 150 వివరాలు: 1. టీమ్‌ లీడ్‌: 16 2. మైక్రోవేవ్‌/వైర్‌లెస్‌ టెక్నీషియన్‌: 16 3. రిగ్గర్‌: 32 4. ఐబీఎస్‌ డిజైనర్‌/ఇంజినీర్‌: 02 5. ఐబీఎస్‌ టెక్నీషియన్‌: 05 6. ఐబీఎస్‌ హెల్పర్‌: 15 7. సివిల్ ఇంజినీర్‌: 02 8. సివిల్ సూపర్‌వైజర్‌: 05 9. సివిల్ హెల్పర్‌: 20 10. ఐపీ ఇంజినీర్‌: 02 11. సీనియర్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ టెక్నీషియన్‌: 11 12. జూనియర్ ఆప్టికల్ ఫైబర్‌ టెక్నీషియన్‌: 09 13. సివిల్ టీమ్‌ లీడ్‌: 06 14. సివిల్ హెల్పర్‌: 08 15. సీనియర్ ఇంజినీర్‌: 01 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్‌, డిప్లొమా/ఐటీఐ, డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: పోస్టులను అనుసరించి 35 ఏళ్ల నుంచి 50 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 డిసెంబర్‌ 9. Website:https://www.tcil.net.in/current_opening.php

Government Jobs

ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐలో టీచింగ్‌ పోస్టులు

సత్యజిత్‌ రే ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ) ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 14 వివరాలు:  ప్రొఫెసర్‌: 04 అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 04 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 06 విభాగాలు: ఆర్ట్‌ డైరెక్షన్‌, డైరెక్షన్‌, థియేటర్‌ ఆర్ట్స్‌, స్క్రీనింగ్‌ యాక్షన్‌, యానిమేషన్‌, స్క్రీన్‌ప్లే రైటింగ్‌, డైరెక్షన్‌, స్క్రీన్‌ యాక్టింగ్‌, పీఎఫ్‌టీ, సౌండ్‌ రికార్డింగ్‌ అండ్‌ డిజైన్‌, సినిమాటోగ్రఫీ.  అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.1,38,072; అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,19,424; అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.99,936. వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 63 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌, ట్రేడ్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు పీజు: రూ.1200; ఎస్సీ/ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. దరఖాస్తు విధానం: గూగుల్‌ లింక్‌ ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ: 05.12.2025. Website:https://srfti.ac.in/Vacancy/

Government Jobs

నిట్‌ దుర్గాపుర్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్‌) దుర్గాపుర్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన నాన్‌ టీచింగ్‌ గ్రూప్‌-ఏ, బి, సి పోస్టుల భర్తీకి ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.   మొత్తం పోస్టుల సంఖ్య: 118  వివరాలు:  గ్రూప్‌-ఏ పోస్టులు: మొత్తం పోస్టులు 10 1. ప్రిన్సిపల్ సైంటిఫిక్/ ప్రిన్సిపాల్ టెక్నికల్ ఆఫీసర్: 02 2. సూపరింటెండింగ్ ఇంజినీర్: 01 3. డిప్యూటీ లైబ్రేరియన్: 01 4. సీనియర్ ఎస్‌ఏఎస్‌ ఆఫీసర్: 01 5. మెడికల్ ఆఫీసర్: 01  6. అసిస్టెంట్ రిజిస్ట్రార్: 02 7. అసిస్టెంట్ లైబ్రేరియన్: 01 8. సైంటిఫిక్/టెక్నికల్ ఆఫీసర్: 01 గ్రూప్‌-బి: మొత్తం పోస్టులు 31 1. టెక్నికల్‌ అసిస్టెంట్‌/జూనియర్‌ ఇంజినీర్‌: 25 2. లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌: 01 3. సూపరిటెండెంట్‌: 05 గ్రూప్‌-సి: మొత్తం ఖాళీలు 77 1. టెక్నీషియన్‌: 26 2. సీనియర్‌ అసిస్టెంట్: 07 3. సీనియర్‌ టెక్నీషియన్‌: 13 4. జూనియర్‌ అసిస్టెంట్‌: 14 5. ల్యాబ్‌ అటెండెంట్‌/ ఆఫీస్‌ అటెండెంట్‌: 17 అర్హతలు: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్‌, సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్‌ లేదా ఎంఎస్సీ/ఎంసీఏ, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీబీఎస్‌, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత, ఉద్యోగానుభవం కలిగి ఉండాలి. ఎంపిక విధానం: స్కిల్‌ టెస్ట్‌/రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు ఫీజు: గ్రూప్‌-ఏ జనలర్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 1500; గ్రూప్‌ బి, సీ పోస్టులకు రూ.1000; ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్విస్‌మెన్‌, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2.12.2025 Website:https://nitdgp.ac.in/p/careers