విశాఖకు చెందిన యువ చెస్ క్రీడాకారిణి ఎం.సాహితి వర్షిణి మహిళల గ్రాండ్ మాస్టర్ (డబ్ల్యూజీఎం) హోదా సాధించింది. 2026, సెప్టెంబరు 8 నుంచి 14 వరకు సెర్బియాలో జరిగిన టోర్నీ సందర్భంగా ఆమె.. ఈ హోదాకు అవసరమైన చివరిదైన మూడో నార్మ్ను సంపాదించింది. 9 రౌండ్ల నుంచి 6 పాయింట్లు సాధించిన సాహితి.. ఆ టోర్నీలో రన్నరప్గా నిలిచింది.