ప్రజలకు మెరుగైన వైద్యసేవలకు నిర్దేశించిన ‘సంజీవని’ ప్రాజెక్టును 2027, జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రజల వైద్య ఖర్చులు తగ్గించేందుకు దీన్ని తెచ్చినట్లు పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గం సహా చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే సంజీవని ప్రాజెక్ట్ను పైలెట్ ప్రాతిపదికన అమలు చేస్తున్నారు.