భారత స్పిన్నర్ శ్రీచరణి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆసియా కప్ ఫైనల్లో నాలుగు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్న శ్రీచరణి కెరీర్లో ఉత్తమ రేటింగ్ పాయింట్లను సాధించింది. ప్రస్తుతం ఆమె ఖాతాలో 804 పాయింట్లున్నాయి. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో 800 పాయింట్ల మార్క్ను దాటిన భారత తొలి మహిళా ప్లేయర్గా ఆమె రికార్డు సృష్టించింది.