తమిళనాడులోని కడలూర్ జిల్లా కోరమండల్ తీరం వెంబడి ఇసుక దిబ్బలు, తీరప్రాంతాల్లో అన్నామలై విశ్వవిద్యాలయం విద్యార్థులు కొత్త మొక్కను కనుగొన్నారు. ఈ మొక్కకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేరు మీద ‘లూకస్ ద్రౌపదియే’ అని నామకరణం చేశారు.
అన్నామలై విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగానికి చెందిన పరిశోధకులు సుగశీలన్, కాత్తవరాయన్, మణిగండన్, సెల్వం, శ్రీకాంత్, ప్రొఫెసర్ ఆదినారాయణన్ రాజేష్ ఈ కొత్త మొక్కను కనుగొన్నారు.