- కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి అధ్యక్షతన పనిచేసే బోర్డ్ ఆఫ్ ట్రేడ్లోకి దేశంలోని పలువురు పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలతో కూడిన 29 మంది నాన్-అఫిషియల్ సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈ బోర్డులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన సీనియర్ అధికారులు సభ్యులుగా ఉంటారు.
- బోర్డు స్థానం పొందిన ప్రముఖుల్లో సి.శ్రీనివాసులు శెట్టి (ఎస్బీఐ ఛైర్మన్), విరాట్ భాటియా (యాపిల్ ఇండియా ఎండీ), అనిష్ షా (మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ), శ్రీధర్ వెంబు (జోహో సహవ్యవస్థాపకుడు), శైలేష్ చంద్ర (సియామ్ అధ్యక్షుడు, టాటా మోటార్స్ ఎండీ, సీఈఓ) ఉన్నారు.