భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా నిలిచాడు. 2025, నవంబరు 24న సిడ్నీలో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్యసేన్ 21-15, 21-11తో యుషి తనక (జపాన్)పై విజయం సాధించాడు. 38 నిమిషాల్లోనే ప్రత్యర్థిని చిత్తుచేసిన లక్ష్యసేన్.. ఈ ఏడాది (2025) తొలి అంతర్జాతీయ టైటిల్ గెలుచుకున్నాడు.