Published on Nov 25, 2025
Current Affairs
బ్యాడ్మింటన్‌ టోర్నీ
బ్యాడ్మింటన్‌ టోర్నీ

భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో విజేతగా నిలిచాడు. 2025, నవంబరు 24న సిడ్నీలో జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో లక్ష్యసేన్‌ 21-15, 21-11తో యుషి తనక (జపాన్‌)పై విజయం సాధించాడు. 38 నిమిషాల్లోనే ప్రత్యర్థిని చిత్తుచేసిన లక్ష్యసేన్‌.. ఈ ఏడాది (2025) తొలి అంతర్జాతీయ టైటిల్‌ గెలుచుకున్నాడు.