Published on Feb 10, 2025
Current Affairs
బీఈఎల్‌తో నౌకాదళం ఒప్పందం
బీఈఎల్‌తో నౌకాదళం ఒప్పందం

భారత నౌకాదళం కోసం 11 కొత్త తరం ఆఫ్‌షోర్‌ గస్తీ నౌకలు, 3 క్యాడెట్‌ శిక్షణ నౌకల కోసం అవసరమైన 28 కీలక సిస్టమ్స్‌ను కొనుగోలు చేసేందుకు భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌)తో రూ.624 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ 2025, ఫిబ్రవరి 8న వెల్లడించింది. 

11 కొత్త తరం ఆఫ్‌షోర్‌ గస్తీ నౌకలు, 3 క్యాడెట్‌ ట్రైనింగ్‌ నౌకల కోసం 28 ఈఓఎన్‌-51 సిస్టమ్స్‌ను బీఈఎల్‌ నుంచి రూ.624 కోట్లతో కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది.