ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్గా పనిచేస్తున్న 1986 బ్యాచ్ కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్సూద్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. 2026, మే 24వ తేదీతో ముగియనున్న ఆయన పదవీకాలాన్ని సంవత్సరంపాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రవీణ్సూద్ 2023 మే 25 నుంచి సీబీఐ డైరెక్టర్గా కొనసాగుతూ వస్తున్నారు.