- కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న 2027 జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో భాగంగా హోంమంత్రి అమిత్ షా 2026, మార్చి 5న ప్రగతి, వికాస్ పేరుతో రెండు జనగణన చిహ్నాలను ఆవిష్కరించారు. స్త్రీ, పురుష జనగణకులను ప్రతిబింబించేలా వీటిని రూపొందించారు. 2027 జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన సమాచారాన్ని వీటి సాయంతో ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేస్తారు.
- తొలిసారి డిజిటల్ రూపంలో సేకరించనున్న లెక్కల కోసం సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడాక్) రూపొందించిన డిజిటల్ సాధనాలను కూడా అమిత్షా ఈ సందర్భంగా విడుదల చేశారు.