పింఛన్పై గ్రామీణుల్లో అవగాహన తీసుకువచ్చి, పదవీ విరమణ భద్రతను కల్పించడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖతో ‘పింఛన్ నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ’ (పీఎఫ్ఆర్డీఏ) 2026, సెప్టెంబరు 15న ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. దీనికింద ‘పెన్షన్ సఖి’ వ్యవస్థ ఏర్పాటవుతుంది. ‘దీన్దయాళ్ అంత్యోదయ యోజన- జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్’ కింద ఉన్న బ్యాంకింగ్ కరస్పాండెంట్ సఖిల ద్వారా పింఛన్ పథకాల్లో ప్రజల్ని చేర్పించి, ఆ తర్వాత కూడా వారికి కావాల్సిన సహకారం అందిస్తారు. స్వయం సహాయక బృందాల సంస్థాగత బలాన్ని వినియోగించుకుంటారు.