తెలంగాణలో క్రీడాభివృద్ధి లక్ష్యంగా కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ(కేఎన్ఎస్యూ)తో ‘యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకుంది.
దక్షిణ కొరియాలోని సియోల్లో తాజాగా కేఎన్ఎస్యూ ప్రతినిధుల బృందం.. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ బృందం ఒప్పందంపై సంతకాలు చేశాయి.
ఇందులో భాగంగా ప్రపంచస్థాయి క్రీడా మౌలిక వసతులు, ప్రతిభ, శిక్షణ వంటి అంశాల్లో తెలంగాణకు కేఎన్ఎస్యూ సహకారం అందించనుంది. ఈ ఒప్పందం అయిదేళ్లుపాటు అమల్లో ఉంటుంది. పరస్పర అంగీకారంతో పునరుద్ధరించుకోవచ్చు.