Published on Nov 25, 2025
Current Affairs
జీ20 సదస్సు
జీ20 సదస్సు
  • జొహన్నెస్‌బర్గ్‌లో జీ20 సదస్సు 2025, నవంబరు 23న ముగిసింది. సదస్సుకు ఆతిథ్యమిస్తున్న దక్షిణాఫ్రికా, జీ20 కూటమి తరఫున ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేసింది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని, అది ఏ రూపంలో ఉన్నా తెగనాడాల్సిందేనని జీ20 శిఖరాగ్ర సదస్సు తీర్మానం చేసింది. 
  • కూటమి దేశాల్లో డిజిటల్‌ మౌలిక సదుపాయాలు మెరుగుపరచడంపై దృష్టి పెడతామని పేర్కొంది. ఏఐ సాంకేతికతలను అందిపుచ్చుకునే విషయంలో కలిసికట్టుగా పనిచేస్తామని, ఏఐతో తలెత్తే ముప్పును తగ్గించే చర్యలను సైతం ఐక్యంగానే చేపడతామని తెలిపింది.