జర్మనీ విమానాశ్రయాల ద్వారా ఇతర దేశాలకు వెళ్లే భారతీయ ప్రయాణికులకు ఇకపై ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్ వీసా అవసరం లేదని జర్మనీ దౌత్య కార్యాలయం 2026, జూన్ 2న ప్రకటించింది. జూన్ 3 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ 2026, జనవరిలో భారత్ను సందర్శించినప్పుడు కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ మార్పు చోటుచేసుకుందని ఎంబసీ పేర్కొంది.