Published on Apr 22, 2025
Admissions
ఎంఎస్‌ఈలో ఎంఏ ప్రవేశాలు
ఎంఎస్‌ఈలో ఎంఏ ప్రవేశాలు

తమిళనాడులోని మద్రాస్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ 2025-26 విద్యాసంవత్సరానికి తదితర విభాగాల్లో ఎంఏ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌  ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

ఎంఏ (మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌)- 2025-26

ప్రోగ్రాములు:

1. యాక్చూరియల్‌ ఎకనామిక్స్‌

2. అప్లైడ్‌ క్వానిటేటివ్‌ ఫైనాన్స్‌

3. ఎన్విరాన్మెంటల్‌ ఎకనామిక్స్‌

4. ఫైనాన్సియల్‌ ఎకనామిక్స్‌

5. జనరల్‌ ఎకనామిక్స్‌

మొత్తం సీట్లు: 47 (ఆల్‌ ఇండియా- 31; తమిళనాడు- 16)

వ్యవధి: 2 సంవత్సరాలు.

అర్హత: సోషల్ సైన్సెస్ (కామర్స్ & మేనేజ్‌మెంట్‌తో), సైన్సెస్ లేదా ఇంజినీరింగ్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే వారు కూడా అర్హులు) ఉత్తీర్ణత ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.1200; ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.1000.

దరఖాస్తు చివరి తేదీ: 11.05.2025.

ఎంట్రెన్స్‌ టెస్ట్‌: మే 31.

Website:https://www.mse.ac.in/m-a-programmes-mse/