అమెరికాలో మసాచుసెట్స్ గవర్నర్ మౌరా హీలీ ఆగస్టు 15ను భారత దినోత్సవంగా ప్రకటించారు, తమ రాష్ట్రానికి ప్రవాస భారతీయులు అందించిన సేవలు, సహకారాన్ని గుర్తిస్తూ, ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రజలను కోరారు. ఇదే రాష్ట్రంలోని బోస్టన్ నగర మేయర్ మిచెల్ వు కూడా ఆగస్టు 15ను భారత దినోత్సవంగా ప్రకటించారు.